Your Ad Here

Tuesday, May 4, 2010

Srinivaasa Kalyanam: NewJersey


సాక్షాత్తు శ్రీ రంగనాధుడు..'సిరీ'భూ' దేవి సమెతులై న్యూజెర్సీ విచ్చెసాడు..

ఏడు కొండలపై నివాసముండే రమా నాధుడు..అమెరికా దేశాన్ని పావనం చెసాడు

కని విని యెరుగని కళ్యాణ వైభొగం తో ఇక్కడి వారందరిని తరింప చెసాడు..

ఆద్యంతం ఆసక్తి దాయకంగా జరిగిన శ్రీమన్నారాయుని కళ్యాణ విశేషాలు మీ కోసం..


2010 మే 1వ తారిఖు ..మొర్గన్ విల్లె, న్యూజెర్సీ లొ శ్రీ వారి వివాహ మహోత్సవం జరిగింది ..

ఆ రొజంతా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది..

ఆడవారంతా పట్టు చీరలతో మగవారంతా పట్టుపంచెలు..షేర్వాణిలతో ఆ మండపానికి మరింత శొబగులు అద్దారు

ఆంతా చూస్తుంటే మన తెలుగు నాట జరిగే సంప్రదాయమైన పెళ్ళి సందడి లా ఉంది..

మరి అక్కడ జరిగేది మాములు పెళ్ళా? శాక్షాత్తు శ్రీ.”శ్రీనివాసుని పెళ్ళిసందడి..


ఫ్రొద్దున్నే సుప్రభాత సేవ తో స్వామి వారి సెవలు మొదలయ్యాయి..తరువాత అలంకారం జరిగింది..అప్పటికే కళ్యాణం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరు లైన్ లొ ఎదురు చూస్తున్నారు..

ముందు గా స్వామి వారిని ఊరెగించిన తరువాతే అందరిని కళ్యాణ మండపం లొకి అనుమతిస్తారు..

దాదాపు 9:30 కి ఊరెగింపు మొదలయ్యింది.వేద మంత్రాల ఉచ్చరణ తో,సన్నాయి మేళాలతొ ఆ పురుషొత్తముడిని పల్లకి లొ మండపం చుట్టూ ఊరెగించారు..విచ్చేసిన భక్తులందరు స్వామి వారి వెనకే నడుస్తూ కళ్యాణ మండపం లోకి చేరుకున్నారు. కళ్యాణం టికెట్లు తీసుకున్న వారందరు వారి వారి టికెట్ ఖరీదు ని బట్టి మూడు పంక్తులలొ కూర్చున్నారు..

ముందుగ కార్యక్రమ నిర్వాహకులు అందరికి స్వాగతాలు పలికారు..ముఖ్య పూజారులు.. కళ్యాణ విశిష్టతను సభ కి వివరించారు..తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన గాయకులు “బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మమొక్కటే””గొవింద గొవింద అని కొలువరే..” అంటూ పలు అన్నమయ్య కీర్తనలు, పాటలతో కళ్యాణ వేడుక ని ప్రారంభించారు..


కళ్యాణం లొని ముఖ్య ఘట్టాలైన పెళ్ళికొడుకుని స్వాగతించుట,అగ్ని హోత్రం,మధుపర్కాలు(బట్టలు పెట్టటం),మహా శంకల్పం,మాంగళ్య ధారన ,తలంబ్రాలు,ఫూర్నాహుతి..ఇలా అన్ని ఎంతో చక్కగా వివరిస్తూ అత్యంత శ్రద్దా భక్తులతో నిర్వహించారు..

మధ్య మధ్యలొ “పిడికెడు తలంబ్రాల పెళ్ళి కూతురు..””చూడరమ్మ సతులార..” ఇలా మరికొన్ని అన్నమయ్య కీర్తనలు..పసందైన పాటలు విచ్చేసిన వారికి ఉత్తేజాన్ని పంచాయి.

అలాగె సినీ గేయ రచయిత జొన్నవిత్తుల గారు రాసి ఆలపించిన “విమాన వేంకటనాధుడు..ఎయిర్ ఇండియా విమానమెక్కి విదేశమొచ్చాడు..” అంటూ సాగిన పాట అందరిని అలరించింది.

అలా ఆద్యంతం ఉల్లాసభరితంగా జరిగిన వివహానంతరం అందరికి సర్వదర్శనం ఎర్పాటు చేసారు..

ఆ తరువాత అందరికి అన్నదానం అంటే మహాప్రసాదం పంచారు ..

సర్వదర్శనం దాదాపు సాయంత్రం 6-7 దాక జరుగుతూనే ఉంది..గురువాయప్పన్ మందిరం లొ పార్కింగ్ సరిపొదు కనుక అందరికి వొనేజ్ ఆఫిసు దగ్గర పార్కింగ్ ఇవ్వటం జరిగింది.అక్కడనుచి కళ్యాణ మండపానికి బస్సులు తిరిగాయి..


ఇక ఎంతో మంది వాలంటీర్లు ఎన్నో రోజుల ముందు నుంచి యెర్పాటులు చూసుకున్నారు ..

అలాగే శనివారం రోజు రిజిస్ట్రేషన్ దగ్గరనుంచి..అన్నదాన కార్యక్రమం దాక అన్ని పనుల్లొ చురుగ్గా పాల్గొని శ్రీనివాసునికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు..

ఈ మహత్తర కార్యాన్ని తలపెట్టిన ప్రముఖులు ,వేదికనలంకరించిన అర్చకులు ,సాయమందించిన వాలంటీర్లు ..విచ్చేసిన భక్తులు నిజంగా ధన్యులయారు!!

కన్నుల పండువగ జరిగిన కలియుగ దేవుని కళ్యాణ వైభొగం

సమస్తం రమణీయం,స్మ్రుతి పధం లొ చిరస్మరణీయం..

3 comments:

Prabhakar said...

:) nice

Unknown said...

Really kool:-) keep going..

Satya said...

chala bagundi.. how can we write comments in telugu?